జ్ఞాన్ పీఠ్ పురస్కార గ్రహీత “శ్రీలాల్ శుక్లా”

ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత రచయిత శ్రీలాల్ శుక్లా 2009 లో జ్ఞాన్ పీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు. శ్రీలాల్ శుక్లా, స్వాతంత్ర్య అనంతరం భారత సమాజంలో నైతిక విలువలకు సంబంధించిన కథాంశాలను నవలలుగా మలిచారు. తన రచనల్లో గ్రామీణ, పట్టణ జీవితాల్లోని లోటుపాట్లను వ్యంగ్యంగా ఎత్తిచూపారు. శ్రీలాల్ శుక్లా రచించిన రాగ్ దర్బారీ నవల, పాఠకులను అమితంగా ఆకట్టుకోవడంతో పాటు, ఆంగ్లం, తెలుగు భాషలతో సహా 15 భారతీయ భాషల్లోకి అనువాదమైంది.

నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత ‘మారియో వర్గాస్ లోసా’

పెరూ దేశానికి చెందిన రచయిత మారియో వర్గాస్ లోసా 2009లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. మారియో వర్గాస్ లోసా తన రచనల్లో ఎక్కువగా అధికారం మరియు పెట్టుబడిదారీ విధానంపై విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. తన మొదటి పుస్తకం “ది టైమ్ ఆఫ్ ది హీరో”తో వర్గాస్ లోసా గొప్ప ప్రశంసలు అందుకున్నారు. వర్గాస్ లోసా రాజకీయాల్లో పాలుపంచుకుంటూనే రచనలు కొనసాగించారు. “ది గ్రీన్ హౌస్,” ది వార్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్,” “కెప్టెన్ పాంటోజా అండ్ సీక్రెట్ సర్వీస్” వంటివి మారియో వర్గాస్ లోసా ప్రముఖ రచనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com