కరోనా మహమ్మారి ప్రపంచమంతటా విస్తరిస్తున్న వేళ, రచయితలు ‘పదాల కూర్పు’ ద్వారా స్పందించారు. వీటన్నిటినీ ఒకచోట పేర్చారు రచయిత ఇలాన్ స్టవాన్స్. 35 దేశాలకు చెందిన 50 మంది రచయితలు ఈ సంకలనంలో భాగస్వామ్యులయ్యారు. ఈ పుస్తకం 12 భాషలలో అందుబాటులో ఉంది. కరోనా మహమ్మారి ద్వారా ప్రజల్లో కలిగిన అన్ని అంశాలను రచయితలు పరిగణనలోకి తీసుకున్నారు.
నరకపు అంచుల నుండి పయనించి, స్వర్గం యొక్క సుందర దృశ్యాలను ఎలా చూడగలిగారు అనే అంశాలను రచయిత ప్రాతిపదికగా తీసుకున్నారు. వైరస్ యొక్క విస్ఫోటనం మరియు భవిష్యత్తుకు కావాల్సిన రోడ్మ్యాప్ యొక్క అవసరాన్ని కొందరు రచయితలు ఇందులో చర్చించారు.