ఆలేరు ముద్దుబిడ్డ, దాశరథి పురస్కార గ్రహీత, కవితిలక, డా|| తిరునగరి 25, ఏప్రిల్ 2021 న హైదరాబాద్ లో గుండెపోటుతో స్వర్గస్థులయారు. ఐదు దశాబ్దాల నుంచి నిరంతర సాహిత్యసృజన చేస్తున్న పద్యకవి, వచన కవి, విమర్శకులు, అపారమైన ధారణ కలిగినపండితులు తిరునగరి. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషలో మంచి అభినివేశం ఉంది. ఆశువుగా పద్యాలూ చెబుతూ సాహిత్యోపన్యాసలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ముప్పైకి మించి సాహితీ రచనలు, వెయ్యికి పైగా సాహిత్య వ్యాసాలు, వందలకొలది ఆకాశవాణి, దూరదర్శన్లలో పాటలు రచించారు. మూడు దశాబ్దాల పాటు తెలుగు భాషోపాధ్యయుడుగా పనిచేసిన తిరునగరి, ఎన్నో ప్రభుత్వ, ప్రభుత్వేతర అవార్డులను గెలుచుకున్నారు. తిరునగరికి తంగేడు అశ్రు నివాళి అర్పిస్తున్నది. వారి ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com