ఒరియా సాహిత్యవేత్త ప్రతిభా రాయ్ 2011లో జ్ఞాన్ పీఠ్ అవార్డును పొందారు. ప్రతిభా రాయ్, తన మాతృభాష ఒడియాలో నవలలు, అనేక కథలు రాశారు. ఆమె రాసిన మొదటి నవల “బర్షా బసంత బైశాఖ ” విశేష ప్రాచుర్యం పొందింది. ఆమె రాసిన సృజనత్మక రచనలకు గాను అనేక జాతీయ, రాష్ట్ర పురస్కారాలు పొందింది. సమానత్వం, ప్రేమ, శాంతి, సమైక్యత వంటి అంశాలపై పరిశోధనలు చేస్తూ, అనేక నవలలు రచించారు. అరణ్య, నిషిద్ధ పృధివి, నిలతృష్ణ, ఆదిభూమి వంటివి ప్రతిభా రాయ్ ప్రముఖ రచనలు.

నోబెల్ సాహిత్య బహుమతి ఎలైస్ మన్రో

ప్రముఖ కెనడా రచయిత్రి ఎలైస్ మన్రో సాహిత్యంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. చిన్న చిన్న పట్టణాల్లోని సామాజిక వాతావరణాన్ని, మానవ సంబంధాలను, నైతిక సంఘర్షణలను తన కథల్లో వర్ణించారు ఎలైస్ మన్రో. కథా వస్తువు కంటే కథ చెప్పే తీరుకే ప్రాధాన్యమిచ్చే శైలితో ఎలైస్ మన్రో అనతి కాలంలోనే సాహిత్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకోగలిగారు. ‘ది డెమైన్షన్స్ ఆఫ్ ఏ షాడో’ పేరిట తొలి కథ రాశారు. ‘డాన్స్ ఆఫ్ ది హ్యాపీ షేడ్స్’ పేరిట 1968లో వెలువరించిన కథా సంపుటి ఎలైస్ మన్రోకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చి పెట్టింది. లైవ్స్ ఆఫ్ గర్ల్స్ అండ్ విమెన్, ద మూన్స్ ఆఫ్ జుపీటర్, డీయర్ లైఫ్ వంటివి ఎలైస్ మన్రో ప్రముఖ రచనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com