కాళోజీ జన్మదిన భాషోత్సవాలు
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రజాకవి కాళోజీ జయంతిని పురస్కరించుకుని తెలుగుభాషా దినోత్సవాన్ని సెప్టెంబర్ 9న నిర్వహించింది. కోఠి మహిళ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రోజా రాణి సభాధ్యక్షులుగా వ్యవహరించారు. కోఠి మహిళ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం కవిత ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు. సీతారాం, అమ్మంగి, అన్నవరం, దేవేందర్, మౌనశ్రీ, మామిడి హరికృష్ణ, అనిశెట్టి రజిత, సూర్య, ధనంజయ లాంటి ప్రముఖ కవులు పాల్గొన్న ఈ సభ ఎస్ రఘు తెలుగు శాఖ అధ్యక్షులు కోఠి మహిళ కళాశాల సారథ్యంలో జరిగింది.