మహంతమ్మ గారి పద్యం
(క్రీ.శ. 1833 ప్రాంతం)
శ్రీ సదాశివచిత్త సరసిజవాస గురు నందీశ్వరా
వాసవాది గీరీశ సన్నుత దాసపాలక శ్రీకరా
వ్యాస భుజయుగ వార్ధి కుంభజ యేశ భువనాధీశ్వరా
బాసుర ప్రద బొరళా చలమందిరా బసవేశ్వరా
సోమరాజు ఇందుమతాబాయిగా పద్యం:-
(1910,1915-1984, రుద్రాక్ష పల్లి, ఖమ్మం జిల్లా)
శా|| ఆచారమ్మలలంకృతమ్మలు స్తుతి వ్యాపారముల్ నేఁటివా
పాచీనంబుల నిండి కొన్నవి సమార్థ వ్రతంబందోన్
హా చైతన్య కలాస్వరూపిణి త్రిలింగోర్వీ సుమారామముల్
బూచెన్ గా మధురాన నేందు మధు సంపూర్ణ ప్రవాహంబునన్
రూప్ఖానుపేట రత్నమ్మ గారి పద్యం:-
(1847-1929, రంగారెడ్డి జిల్లా, పరిగి, ఇప్పటూరు)
కం// తరుణీకృత పాండిత్యము
స్థిరమూ యీ మాటలను ఛేదింపకుడీ
హరియాజ్ఞగాక నాకీ
కరణి యుపన్యాస మొసగు జ్ఞానముగలదే
జ్ఞానాంబ గారి పద్యం:
(1930 వ దశకం, ఖమ్మం)
మ|| నిను బద్యంబులఁ బాటలన్ గృతులతో నిక్కంపు సద్భక్తియై
వినుతిన్ జేపెద నీ కరంబులను హృద్వీధిన్ దగన్ జేర్చి మా
నిని నే నన్ను నమాన మౌ కరుణ నెంతేఁజూచి పోషింపునా
తనువున్ బ్రాణము నీకె యర్పితము నాథా సూర్యనారాయణా!