2015 జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత డా.రఘువీర్ చౌదరి

ప్రముఖ గుజరాతీ రచయిత, విమర్శకులు డా.రఘువీర్ చౌదరి 51 వ జ్ఞాన్ పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. 1938 లో గుజరాత్ లో జన్మించిన రఘువీర్ రచయిత 80 కి పైగా పుస్తకాలు రచించారు. గుజరాతీ భాషలో ఎక్కువ రచనలు చేసిన రఘువీర్ చౌదరి, హిందీ భాషలోనూ కొన్ని పుస్తకాలు రచించారు. 1965లో భాషా అస్తిత్వం పై ఈయన రచించిన అమ్రిత నవల అందరి మన్నలను పొందింది. రుద్రమహాలయ, సొంతిర్త్ నవలలు చాలా ప్రాముఖ్యతను పొందాయి. ఈయన రచించిన త్రయ పుస్తకాలు ఉపార్వాస్, సహవాస్, అంతర్వస్ కి 1977లో సాహిత్య పురస్కారాన్ని తెచ్చిపెట్టాయి. రఘువీర్ చౌదరి నవలలతో పాటు, నాటకాలు సైతం రచించారు. ప్రఖ్యాత గుజరాత్ రచయిత చంద్రవదన్ మెహతా జీవిత ఆధారంగా రచించిన త్రిజో పురుష్ అందరి మన్నలను పొందింది. సికిందర్ సాని, డిమ్ లైట్ నాటకం ప్రాముఖ్యాన్ని పొందాయి.

 

 

 

 

నోబెల్ సాహితీ పురస్కారం 2017-కజువో ఇషిగురో

 

బ్రిటన్ నవలా రచయిత కజువో ఇషిగురో 2017 నోబెల్ సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. కజువో ఎనిమిది పుస్తకాలు రాశారు. వాటిని 40కి పైగా భాషల్లోకి అనువదించారు. ‘ద రిమైన్స్ ఆఫ్ ద డే’, ‘నెవర్ లెట్ మి గో’ నవలలు ఆయన రచనల్లో విఖ్యాతమైనవి. ఈ రెండు నవలలు ఆధారంగా తీసిన సినిమాలకు కూడా విశేష ప్రశంసలు లభించాయి. కజువో ఇషిగురో 1954లో జపాన్‌లోని నాగసాకిలో జన్మించారు. ఆయన తండ్రికి సర్రేలో ఓషనోగ్రాఫర్ ఉద్యోగం లభించినపుడు కుటుంబంతో పాటు ఆయన కూడా ఇంగ్లండ్ వలస వెళ్లారు. కజువో రచనలు జ్ఞాపకం, కాలం, స్వీయ-భ్రమ అంశాల మీద ఉంటాయి. ‘ఎ పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ అనే ఆయన సిద్ధాంత గ్రంథం (థీసిస్) 1982లో ప్రచురితమైంది. అది ఆయన తొలి నవలగా విమర్శకుల ప్రశంసలు పొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com