విశ్వ యవనికపై అనేక మార్పులు జరుగుతున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో ప్రపంచం ఎక్కువగా రెండు ధృవాలుగా ఉండి, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత క్లుప్తంగా ఏక ధ్రువంగా ఉంటే..ప్రస్తుతం బహుళ ధృవాలు ఏర్పడే సంకేతాలు వెలువడుతున్నాయి. చైనా ఇప్పటికే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మరియు ప్రధాన సైనిక శక్తి. మారుతున్న కాలంలో భారతదేశ విదేశాంగ విధానం యొక్క దిశ ఏమిటి? అనే అంశంపై భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ పుస్తకంలో వివరించారు.
ఈ పుస్తకంలో, దేశానికి ఎదురయ్యే సవాళ్లు, లభించే అవకాశాల నుండి, భారతదేశం యొక్క విదేశాంగ విధాన పరిణామ క్రమాలను జై శంకర్ వివరించారు.