నోబెల్ సాహిత్య బహుమతి 2014 ‘పాట్రిక్ మోడియానో’
ఫ్రెంచ్ నవలా రచయిత పాట్రిక్ మోడియానో 2014 లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి పొందారు. మానవ జీవితాలునాజీల చేతుల్లో మారణ కాండకు గురైన యూదుల మనో భావాలువారు ఎదుర్కొన్న అవమానాలుఅస్థిత్వాన్ని కోల్పోవడం వంటివి పాట్రిక్ మోడియానో నవలల్లో ప్రధాన అంశాలు. 1945లో పారిస్ నగరంలో జన్మించిన మోడియానో స్వీయానుభవాలే ఆయన సాహిత్య సృష్టికి ప్రేరణలు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే పాట్రిక్ మోడియానోఫ్రెంచ్లో ఇప్పటి వరకు 40కి పైగా నవలలుపలు బాలల పుస్తకాలు రచించారు. ఇందులో కొన్ని నవలలు ఆంగ్లంలోకి అనువదితమయ్యాయి. ‘మిస్సింగ్ పర్స న్’సెర్చ్ వారంట్’డోరా బ్రూడర్’మెమరీ లేన్’ఏ ట్రేస్ ఆఫ్ మాలిస్’ మోడియానో ప్రధాన రచనలు.
జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత 2012 ‘రావూరి భరద్వాజ’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత ‘రావూరి భరద్వాజ’ కు 2012 లో జ్ఞాన్ పీఠ్ పురస్కారం లభించింది. రావూరి భరద్వాజ కథానికలునవలలునవలికలుకవితలువ్యాస సంపుటాలునాటికలుస్మృతి సాహిత్యంతో కలిపి సుమారు 190 పుస్తకాలు రాశారు. ఆయన ప్రసిద్ధ నవల ‘పాకుడు రాళ్లు’. 1950లో ముద్రించబడిన రాగిణి అనే పుస్తకం భరద్వాజ గారి ప్రధమ రచన. పాకుడురాళ్ళుజీవన సమరంకాదంబరి వంటి రచనలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టాయి. పాకుడురాళ్ళు నవలలో భరద్వాజ వెండి తెర వెలుగుల వెనుక ఉన్న చీకటి కోణాలను స్పృశించిన శైలివర్ణించిన విధానం ఒక గొప్ప సంచలనంఆలోచనాత్మకం.